ఇద్దరు కూతుళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి..!!

by Disha Web Desk 6 |
ఇద్దరు కూతుళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి..!!
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఇద్దరు కూమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోల్లార్ జిల్లాలో ముల్భాగల్‌లో నివసిస్తున్న జ్యోతి అనే మహిళకు కొద్ది రోజులుగా భర్తతో గొడవ జరుగుతుంది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతనికి బుద్ది రావాలని ఓ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం ఇద్దరు కూమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ తర్వాత జ్యోతి కూడా ఆత్మహత్య చేసుకుంటుండగా కాలిన వాసనను గమనించిన స్థానికులు వచ్చి ఆమెను అడ్డుకున్నారు. కాలిపోతున్న పిల్లను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో జ్యోతి పెద్ద కూతురు మరణించగా.. చిన్న కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read....

నంద్యాల: ఆల్లగడ్డలో రోడ్డు ప్రమాదం.. సినీ రచయిత రాజసింహ కు తీవ్ర గాయాలు

Next Story

Most Viewed